భారతదేశం, ఆగస్టు 4 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తాజాగా గ్రహాల సేనాపతి అయిన కుజుడు (అంగారకుడు) ఆగస్టు 2న మిథున రాశిలోకి సంచారం చేశాడు. సెప్టెంబర్ 18, 2026 వరకు కుజుడు ఇదే రాశిలో సంచరించనున్నాడు. ప్రస్తుతం మిథున రాశిలో కుజుడు ప్రవేశించడం ద్వారా రాహువుతో ఎదురుపడే పరిస్థితి ఏర్పడింది.

జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాహసం, పరాక్రమానికికారకుడైన కుజుడు, భ్రమం మరియు ఆకస్మిక పరిణామాలకు ప్రతీక అయిన రాహువు ఎదురుపడటం అత్యంత ప్రభావవంతమైన పరిణామం. ఈ శక్తివంతమైన కలయిక కొన్ని రాశుల వారికి జీవితంలో స్వర్ణయుగాన్ని తలపించే శుభ ఫలితాలను ఇస్తుండగా, మరికొన్ని రాశులు కాస్త అప్రమత్తంగా ఉండాలి.

1. మేష రాశి: కుజుని రాశి మార్పు మేష రాశి వారికి అత్యంత లాభదాయకంగా మారుతుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఎంతో బలపడుతుంది. నిల...