భారతదేశం, ఫిబ్రవరి 27 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 27 ఎపిసోడ్ లో.. దాసు మామయ్య కనిపించకపోవడానికి కారణం కిడ్నాప్ ఏమోనని పారు భయపడుతుందని శివనారాయణ ముందు పారిజాతాన్ని ఇరికించాలని కార్తీక్ ట్రై చేస్తాడు. సుమిత్ర ఆపరేషన్ కోసం టెన్షన్ పడుతున్నానని పారు కవర్ చేస్తుంది.

వీడేంటే మనతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నాడు. చూస్తుంటే మన గుట్టంతా వీడికి తెలిసినట్లే ఉందని కార్తీక్ గురించి జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. మరోవైపు గదిలో ఉన్న సుమిత్ర దగ్గరకు దీపను దశరథ తీసుకెళ్తాడు. కొందరికి కొన్ని నిజాలు తెలియకపోతే హాయిగా నిద్రపోతారు. కానీ కొందరికి తెలిసిన నిజాలు చెప్పుకొనేవరకు నిద్ర రాదమ్మా. చక్కగా టిఫిన్ చేసి, ట్యాబ్లెట్స్ వేసుకుని మీ అమ్మ హాయిగా నిద్ర పోతుందని దీపతో దశరథ అంటాడు.

తన కూతురు తనను కాపాడుతుందని నమ్మకం మీ అమ్మకు వచ్చింది. మరి ఆ కూతురు ఎవరో త...