భారతదేశం, జూలై 9 -- కడప పోలీసులు కల్లాపి పొడిని తయారు చేసే పలు కేంద్రాలపై సంయుక్త దాడులు నిర్వహించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న సరుకును స్వాధీనం చేసుకున్నారు. అనేక ప్రాంతాల్లో తయారుచేస్తున్న కల్లాపి పౌడర్ కంపెనీల మీద ఫోకస్ చేశారు అధికారులు. దీనికి కారణం లేకపోలేదు.

ఇళ్ల ముందు వాకిలిలో చల్లడానికి సాధారణంగా ఆవుపేడ కలిపిన నీటిని ఉపయోగిస్తారు. దానికి చౌకైన ప్రత్యామ్నాయంగా వాడే కల్లాపి పొడిని సేవించడం వల్ల కడప జిల్లాలో ఇటీవల ఆత్మహత్యలు ఆందోళనకరంగా పెరగడమే పోలీసుల ఫోకస్‌కు ప్రధాన కారణమని సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రొద్దుటూరులో ఉన్న ఇటువంటి ఐదు కర్మాగారాలు పసుపు, కుంకుమ పొడిని తయారు చేస్తున్నట్లు నటిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

ఎస్పీ నాచికేత్ విశ్వనాథ్ షెల్కే ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు తహసీల్దార్ డి. ఉదయ్ భాస్...