Hyderabad, జూన్ 20 -- ఓటీటీలోకి ఇవాళ ఎన్నో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, తెలుగు, తమిళం భాషల్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు రావడం చాలా అరుదు. కానీ, 2025లో రీసెంట్‌గా ఓ బైలింగువల్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. అదే కలియుగం 2064.

మూడో ప్రపంచ యుద్దం తర్వాత ఆహారం, నీళ్ల కోసం ప్రజలు కొట్టుకుంటారు. వీరిని కంట్రోల్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది. మనుషులను చంపి వారి వద్ద నుంచి ఆహారం లాక్కునే మరో గ్రూప్ కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకచోట సేఫ్ హౌజ్ ఉందని తెలుస్తుంది. ఆ సేఫ్ హౌజ్‌ గురించి తెలిసిన శక్తి అక్కడే నివసిస్తుంటాడు.

అయితే, ఓ రోజు ఆ సేఫ్ హౌజ్‌లోకి భూమి అనే అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? శక్తి, భూమి మధ్య నెలకొన్న పరిస్థితులు ఏంటీ? చివరికి ఏమైంది? అనే అంశాలతో కలియుగం 2064 సి...