భారతదేశం, జనవరి 28 -- సినిమా టికెట్ల మరీ ఖరీదైన వ్యవహారంగా మారుతున్న ఈ రోజుల్లో ఓం శాంతి శాంతి శాంతి: మూవీ మేకర్స్ మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టికెట్ కేవలం రూ.99 మాత్రమే అని అనౌన్స్ చేయగా.. ఇప్పుడు జంటలకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవ్వడం విశేషం.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన మూవీ ఓం శాంతి శాంతి శాంతి: . ఈ సినిమా ఈ శుక్రవారం అంటే జనవరి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఒక రోజు ముందే అంటే జనవరి 29న పెయిడ్ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ షోలు పడే థియేటర్ల లిస్టు రిలీజ్ చేస్తూ వాటిలో ఈ ఆఫర్ అనౌన్స్ చేశారు.
అగనంపూడిలోని ఏషియన్ ముక్తా, అమలాపురంలోని వీపీసీ ఎస్సీ 2, మచిలీపట్నంలోని మినీ రేవతి, అనంతపురంలోని గౌతమి థియేటర్లలో ఈ పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని చెప్పారు. వీటిలో జంటగా వెళ్తే ఒకటి టికెట్ కు మరో టికెట్ ఫ్రీగా ఇస్తారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.