భారతదేశం, ఫిబ్రవరి 11 -- రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసింది. రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేస్తూ. ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ప్రకటన చేశారు.

రాష్ట్రంలోని చాలా మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ బకాయిలు భారీగా పేరుకుపోవటంతో. కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. పరీక్షల సమయంలో హాల్ టికెట్ల జారీ చేసేటప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు కోర్సు పూర్తైన తర్వాత కూడా సర్టిఫికేట్లు కూడా అందించడం లేదు. ఫీజు బకాయిలను చెల్లిస్తేనే సర్టిఫికెట్లను ఇస్తామని తేల్చి చెబుతున్నా...