భారతదేశం, మే 21 -- పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పరిసర ప్రాంతాల రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుతం ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న రెండు కీలక సర్వీసులను ఇకపై శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్ రైళ్లుగా నడపనున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఇప్పటివరకు ఈ రెండు రైళ్లను ప్రత్యేక కేటగిరీ కింద నడపడం వల్ల ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం పడేది. ఈ నిర్ణయంతో ఇకపై సాధారణ రైలు ఛార్జీలతోనే ప్రయాణించే అవకాశం కలగనుంది.

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలానికి (తిరువణ్ణామలై) వెళ్లే శివభక్తులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది. ప్రతి నెల పౌర్ణమి గిరిప్రదక్షిణ కోసం గోదావరి జిల్లాల నుండి వేలాది మంది భక్తులు అరుణాచలం వెళ్తుంటారు. ఇప్పుడు డైరెక్ట్ రెగ్యులర్ ట్...