Andhrapradesh, ఆగస్టు 1 -- ఏపీలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ కీలక సూచన చేసింది. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే పడొచ్చని తెలిపింది.
ఆగస్టు 1 నుంచి 5 వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా , యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువొచ్చని పేర్కొంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.
ఆగస్టు 5, 6, 7 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తంగా వారం రోజులపాటు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.