భారతదేశం, మార్చి 7 -- దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్, నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా కలయికలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ 2' ఫిబ్రవరిలో విడుదలై దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ సినిమాపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సినిమాకు విమర్శించగా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ దీనిని సమాజానికి అద్దం పట్టే చిత్రమని అభివర్ణించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారిక 'ఎక్స్' ఖాతా ది కేరళ స్టోరీ 2 మూవీపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ను షేర్ చేసింది. "ఈ సినిమాను ఎవరూ చూడటం లేదు. కేరళ సంస్కృతి, సంప్రదాయాలు ఏమిటో ఈ దేశ ప్రజలకు తెలుసని ఇది నిరూపిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా మీడియా, సినిమాలను కొన్ని వర్గాలను కించపరచడానికి, సమాజంలో విద్వేషాలు పెంచడానికి ఆయుధాలుగా వాడుకుంటున్నారని ఆయ...