భారతదేశం, ఆగస్టు 3 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, వాటి కలయిక మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గ్రహాల రాశి మార్పులు, వాటి మధ్య ఏర్పడే ప్రత్యేక యోగాలు కొన్ని రాశుల వారికి స్వర్ణయుగాన్ని తలపించే ఫలితాలను ఇస్తాయి. నేటి నుంచి (ఆగస్టు 3) కొత్త వారం ప్రారంభమవుతుండగా, ఈ వారంలో పలు అద్భుతమైన రాజయోగాలు రూపుదిద్దుకోవడం విశేషం.

ప్రస్తుతం గ్రహాల సంచారం అత్యంత అనుకూలమైన స్థితిలో ఉంది. కర్కాటక రాశిలో సంచరిస్తున్న దేవగురు బృహస్పతి 'హంస రాజయోగం' కలుగజేస్తున్నారు. దీనికి తోడు ఆగస్టు 5న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నారు.

దీని వల్ల సూర్య, బుధుల కలయికతో 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడనుంది. మరోవైపు గురు, సూర్యుల కలయిక ద్వారా 'గురు ఆదిత్య రాజయోగం' కూడా కొనసాగుతోంది. ఈ శక్తివంతమైన రాజయోగాల ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ, ఐదు రాశుల వ...