భారతదేశం, జూన్ 9 -- హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏడాది పొడుగునా వచ్చే 24 ఏకాదశుల్లో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దీనినే 'నిర్జల ఏకాదశి' అంటారు. ఈ ఏడాది జూన్ 25వ తేదీన నిర్జల ఏకాదశి వచ్చింది. "ఏడాది పొడవునా ఉండే మిగతా ఏకాదశి వ్రతాలను ఆచరించలేని వారు, కేవలం ఈ ఒక్క రోజు నియమబద్ధంగా ఉపవాసం ఉంటే చాలు.. 24 ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుంది," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు.

ఈ రోజున కనీసం నీళ్లు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉండాలి. అందుకే దీనికి నిర్జల ఏకాదశి అనే పేరు వచ్చింది. వ్రతం ఆచరించే వారు ఉదయాన్నే లేచి, స్నానాది కార్యక్రమాలు ముగించుకుని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ సంకల్పం తీసుకోవాలి. "స్వామి.. కేశవా.. నీ ప్రసన్నత కోసం నేను ఈ రోజు ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం ఉంటాను. కేవలం ఉదయం ఆచమనం నీటిని మాత్...