భారతదేశం, జూలై 25 -- హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే 'దేవశయని ఏకాదశి'కి ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈరోజే ఈ పవిత్ర వ్రతం ఆచరలించాలి. ఈ ఏకాదశితోనే చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరాసాగరంలో యోగనిద్రలోకి వెళ్తారని, ఈ సమయంలో సృష్టి నిర్వహణ బాధ్యతలను భోజన ప్రియుడైన ఆ పరమశివుడు చూసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి.

ఈ పవిత్రమైన రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఆచరించి, శ్రీహరిని పూజిస్తారు. కేవలం పూజలు మాత్రమే కాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుందని విశ్వాసం. నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే విష్ణుమూర్తితో పాటు మహాలక్ష్మి కటాక్షం కూడా సంపూర్ణంగా లభిస్తుంది.

హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది జూలై 25, 2026 శనివారం...