భారతదేశం, మే 28 -- హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో వచ్చే కృష్ణ పక్షం, శుక్ల పక్షం త్రయోదశి తిథులను ప్రదోష వ్రతంగా జరుపుకుంటాం. అయితే, ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రదోష వ్రతం మే 28, గురువారం నాడు వస్తోంది. గురువారం నాడు వచ్చే ఈ ప్రదోషాన్ని 'గురు ప్రదోషం' అని పిలుస్తారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ సమయంలో భోళాశంకరుడిని ఆరాధిస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా జ్యేష్ఠ మాసం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే కాలం కాబట్టి, ఈ సమయంలో పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల ఆయన చల్లబడి భక్తులకు శుభాలను ప్రసాదిస్తారని వేద పండితులు చెబుతుంటారు.

జ్యేష్ఠ శుక్ల పక్ష త్రయోదశి తిథి మే 28వ తేదీ బుధవారం రాత్రి నుంచే ప్రారంభమైనప్పటికీ, సూర్యోదయ తిథి లెక్కన మే 28న వ్రతం ఆచరించాలి. పంచాంగం ప్రకారం, మే 28న ఉదయం 07:56 గంటలకు త్రయోదశి తిథి ప...