భారతదేశం, జూన్ 28 -- Illu Illalu Pillalu: బుల్లితెర నటీనటులకు వెండితెర స్టార్స్‌తో సమానంగా సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ట్రెండీ ఫోటో షూట్స్‌తో అభిమానులకు నిత్యం టచ్‌లో ఉండే సెలబ్రిటీలకు ఫాలోయింగ్ మామూలుగా ఉండటం లేదు. తాజాగా ప్రముఖ తెలుగు సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu) హీరోయిన్ అన్షు రెడ్డి (Anshu Reddy) తన సోషల్ మీడియా ప్రయాణంలో ఒక అద్భుతమైన ల్యాండ్‌మార్క్‌ను చేరుకుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మదగా తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న అన్షు రెడ్డి సోషల్ మీడియాలో ఒక రికార్డు అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య అధికారికంగా 1 మిలియన్ మార్కును దాటింది.

అన్షు రెడ్డి 1 మిలియన్ క్లబ్‌లోకి అడుగుపెట్టడంతో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ టీమ్ ఆమెకు ఊహ...