భారతదేశం, సెప్టెంబర్ 20 -- నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్ధన రెడ్డి తెలిపారు. ఆదివారం (సెప్టెంబర్ 20, 2026) వర్షంలో సైతం మంత్రి జనార్ధన రెడ్డి అధికారులతో కలిసి బనగానపల్లె రింగ్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. సాయిబాబా ఆలయం నుండి రవ్వలకొండ వరకు సాగుతున్న పనులను ఆయన స్వయంగా చూసి, పనుల పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రింగ్ రోడ్డు నిర్మాణ పనులలో ఇప్పటికే సుమారు 80 శాతం పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. రూ.56 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 10.68 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి జనార్ధన రెడ్డి పేర్కొన...