భారతదేశం, జూలై 22 -- ఏడాదిలో నాలుగు నవరాత్రులు వస్తాయి. అందులో ఆషాఢ మాసంలో వచ్చే వాటిని గుప్త నవరాత్రులు అని అంటారు. వీటిని అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. తంత్ర, మంత్ర సాధనలు, రహస్య ఉపాసనలకు ఈ నవరాత్రులు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

జూలై 15న ప్రారంభమైన గుప్త నవరాత్రులు జూలై 22, అంటే నేటితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల్లో పూజలు, వ్రతాలు చేయకపోయినా, ఈరోజు అంటే నవమి తిథి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే మంచిది. అలాగే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది.

గుప్త నవరాత్రుల్లో దశమహావిద్యలను ఆరాధిస్తారు. మాతంగి దేవిని పూజించడం ఆనవాయితీ. అలాగే ఈరోజు చాలా మంది హోమం, కన్యా పూజ వంటివి జరుపుతారు. ముఖ్యమైన పరిహారాలు ఇవే. మరి మీరు పాటిస్తున్నారా?

నవమి నాడు కన్యా పూజ చేయడం చాలా మంచిది. హిందూ శాస...