భారతదేశం, మార్చి 15 -- ఏపీలోని అన్నమయ్య జిల్లా పుంగనూరులో దారుణమైన ఘటన జరిగింది. బైక్ నుంచి వచ్చిన పొగ కారణంగా నలుగురు మృతి చెందారు. బైక్ నుండి వచ్చే పొగను గంటల తరబడి పీల్చడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఊపిరాడక మరణించారు. నలుగురు వ్యక్తులు నిద్రలోనే మరణించారు. ఈ ఘటన పుంగనూరులోని త్యాగరాజు వీధిలో జరిగింది. మృతి చెందినవారిలో తాత, మనవడు, మనవరాళ్లు ఉన్నారు.

త్యాగరాజు వీధికి చెందిన మురళి... శనివారంనాడు బైక్‌ను మెకానిక్‌కు ఇచ్చాడు. ఇంజిన్ సమస్య ఉంది. బోర్ చేయించాక మురళి బైక్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే బైక్‌ను చాలాసేపు ఆన్‌లోనే ఉంచాలని మెకానిక్ చెప్పడంతో ఇంట్లోనే తలుపులు వేసి.. ఆన్‌లోనే ఉంచాడు మురళి. అయితే ఇళ్లు ఇరుకుగా ఉంది. దీంతో పొగ బయటకు వెళ్లలేదు. ఇంట్లో కింద మురళి తండ్రి రామచంద్రయ్య, మురళి పిల్లలు కార్తీక్, చరిత, చందన పడ...