భారతదేశం, ఆగస్టు 25 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 694 పాయింట్లు పడి 81,307 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 214 పాయింట్లు కోల్పోయి 24,870 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 606 పాయింట్లు పడి 55,149 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. -1,652.18 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 269.62 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 24,650- 24,600 లెవల్స్​ కీలక సపోర్ట్​గా ఉంది. 25,050- 25,100 లెవల్స్​ కీలక రెసిస్టెన్స్​గా ఉన్నాయి," అని ఎస్​బీఐ సెక్యూరిటీస్​ వైస్​ ప...