భారతదేశం, జూలై 31 -- హిందూ సనాతన ధర్మంలో ప్రతినెలా రెండుసార్లు ఏకాదశి వ్రతాలు వస్తుంటాయి. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం నెలకు ఒకసారి వచ్చే కృష్ణ పక్షం, మరోసారి వచ్చే శుక్ల పక్షంలో ఈ పవిత్ర ఉపవాసాలను ఆచరిస్తారు. ముఖ్యంగా పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి వ్రతాలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఈ క్రమంలోనే రాబోయే ఆగస్టు నెలలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే కామికా ఏకాదశి, శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రతాల రాకతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి, సకల పాప విముక్తి పొందేందుకు ఈ వ్రతాలు అద్భుతమైన మార్గమని పెద్దలు, పురోహితులు చెబుతుంటారు.

పురాణాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనుషుల పూర్వ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని, అంతిమంగా మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ ప్రత్య...