భారతదేశం, మే 31 -- ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి సంబంధించి అపారమైన డేటా కూటమి ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ-క్రాప్ నమోదులు, డిజిటల్ భూ రికార్డులు, ఎరువుల సరఫరా పర్యవేక్షణ వ్యవస్థలు, సాగునీటి విడుదల షెడ్యూళ్లు... ఇలా రాష్ట్రంలో ఇప్పుడు వ్యవసాయం డేటాబేస్‌ చుట్టూ తిరుగుతోంది. కాగితాలపై చూస్తే ఇది ఆధునికీకరణకు, పరిపాలనా సామర్థ్యానికి సంకేతంలా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం దగ్గర డేటా పెరిగినా... రైతుల్లో అనిశ్చితి తగ్గడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

గ్రామాల్లో రైతుల మనసులో ఒక ఆందోళన నెమ్మదిగా ముసురుతోంది. అది కేవలం యూరియా కొరత గురించో.. సాగునీటి కొరత గురించో కాదు. కూటమి ప్రభుత్వం నిజంగా సాగు చేస్తున్న రైతుని గుర్తిస్తున్నదా? లేక కేవలం పట్టాలను, పత్రాలనే గుర్తిస్తున్నదా..? అన్న అనుమానం పెరుగుతున్నది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న యూ...