భారతదేశం, జూలై 3 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. గత ఐదేళ్లుగా మూడు రాజధానుల చుట్టూ తిరిగిన ఏపీ రాజకీయం... ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అంగీకరించే ప్రసక్తే లేదని వైసీపీ గట్టిగా చెబుతోంది. తాజాగా కూడా ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత జగన్ కూడా ప్రస్తావించారు.రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సరికొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తుందని కూడా ప్రకటించారు.

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 'మావిగన్' (Mavigun - Machilipatnam-Vijayawada-Guntur) కారిడార్‌ను కొత్త రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పుకొస్తున్నారు. ఇదే తమ ఎన్నికల నినాదమని స్పష్టం చేస్తున్నారు.

ఇటీవలే మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్.. వచ్చే ఎన్నికలు కేవలం రెండు పార్టీల మధ్యే కాదు,...