భారతదేశం, ఫిబ్రవరి 26 -- టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎట్టకేలకు పెళ్లితో ఒకటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. అయితే ఏడేళ్ల కిందటే గీత గోవిందం షూటింగ్ సందర్భంగా తొలిసారి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయడానికి విజయ్ భయపడ్డాడన్న విషయం తెలుసా?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ముచ్చట వినగానే అభిమానులకు ఏడేళ్ల క్రితం నాటి 'గీత గోవిందం' సినిమా గుర్తుకు వస్తోంది. అయితే అప్పట్లో ఒక సీన్ కోసం రష్మికకు తాళి కట్టాల్సి వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ తెగ భయపడిపోయాడట. 2018లో సినిమా ప్రమోషన్ల సమయంలో ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ...