భారతదేశం, ఫిబ్రవరి 14 -- ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్‌ తాజాగా 10/90 స్కీమ్‌ ప్రకటించింది. ఫ్లాట్‌ ధరలో ముందస్తుగా 10 శాతం చెల్లించి.. ఇల్లు చేతికి వచ్చాకే కస్టమర్‌కు ఈఎంఐ ప్రారంభమవుతుంది. ఇదే విషయాన్ని అన్విత గ్రూప్‌ చైర్మన్‌ బొప్పన అచ్యుత రావు , సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ సంయుక్తంగా ప్రకటించారు.

కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్, పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా శనివారం స్కీమ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా బొప్పన మీడియాతో మాట్లాడుతూ. ."చాలా మంది కస్టమర్లకు ఇతర లోన్స్‌ ఉంటాయి. దీంతో ఇల్లు చేతికి రాక పూర్వమే గృహ రుణం వాయిదా చెల్లించవలసి రావటం ‌అదనపు భారం అవుతుంది. ఈ క్రమంలోనే నిర్మాణం పూర్తి చేసి కొనుగోలు దారులకు గృహం అందించే వరకు ఆ భారాన్ని కంపెనీ తీసుకుంటుంది. ఈ సౌలభ్యంతో ఎక్కువ మంది ఇల్లు తీసుకునేందుకు ముందుకు వస్తారు...