భారతదేశం, ఏప్రిల్ 25 -- అనంతపురం జిల్లాలో హనీట్రాప్ గుట్టురట్టైంది. అయితే అధికార పార్టీకి చెందిన ఇద్దరు అనుచరులు ఈ దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా అనంతపురంలో సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు వీరికి పోలీసులు కూడా సహకరిస్తున్నారని ప్రచారం జరిగింది.

విశ్రాంత ఉద్యోగులు, పూజారులు, ధనవంతులను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ ముఠాలు పోలీసుల సహకారంతో పనిచేస్తున్నాయని విచారణలో వెల్లడైంది. ఏప్రిల్ 18న ఒక యువకుడు ఫిర్యాదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. తనను ఒక ఇంటికి రప్పించి, దాడి చేసి, బట్టలు విప్పించి, అసభ్యకరమైన ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేశారని ఆ యువకుడు ఆరోపించాడు. అవమానానికి భయపడి బాధితుడు ఆ ముఠాకు సుమారు రూ. 4 లక్షలు చెల్లించినట్లు సమాచారం.

హనీ ట్రాప్ ముఠాతో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతో సహా డజనుకు పైగా సిబ్బ...