భారతదేశం, సెప్టెంబర్ 3 -- నేటి బిజీ డిజిటల్ జీవితంలో శరీరంతో పాటు మనసు కూడా వేగంగా అలసిపోతోంది. ఏదో ఒక పాత సంఘటనను పదే పదే మననం చేసుకోవడం, ఇతరులు అన్న మాటలపై అనవసరంగా మదనపడటం లేదా భవిష్యత్తు గురించి భయపడటం చాలామందిలో సాధారణమైపోయింది. సమస్య చాలా చిన్నదైనప్పటికీ, మనసు దానిని పదే పదే ఆలోచించి పెద్దదిగా మార్చేస్తుంది.

ఈ స్వభావమే క్రమంగా 'ఓవర్‌ థింకింగ్‌' (అతిగా ఆలోచించడం) అనే మానసిక సమస్యగా మారుతుంది. మహాభారత యుద్ధ సమయంలో కురుక్షేత్రంలో అర్జునుడు కూడా సరిగ్గా ఇలాంటి మనోవేదనతోనే సతమతమయ్యాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అందించిన అమూల్యమైన గీతోపదేశం నేటి అశాంతి పూరిత మనసులకు కూడా చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది. భగవద్గీత ప్రకారం మనసులో ఆలోచనలు రావడం సహజం, కానీ ప్రతీ ఆలోచననూ పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదని పెద్దలు చెబుతున్నారు.

మనసు చాల...