భారతదేశం, ఏప్రిల్ 9 -- రాయలసీమ వ్యాప్తంగా జనావాసాల్లోకి చిరుతల చొరబాట్లు పెరగడం కనిపిస్తోంది. పులులకు తీవ్రమైన నీటి కొరత, ఆవాసాలు తగ్గిపోవడం, పెరుగుతున్న పర్యావరణ ఒత్తిడే ఈ ధోరణికి కారణమని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. తక్షణమే సరిదిద్దే చర్యలు తీసుకోకపోతే.. ఈ ప్రాంతంలో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలం చిన్న బకరపురం గ్రామంలో ఇటీవల జరిగిన ఓ ఘటన జరిగింది. గ్రామంలోకి ప్రవేశించిన చిరుత పిల్లను వీధి కుక్కలు చంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ అధికారుల సమాచారం ప్రకారం, రాయలసీమలో గత మూడేళ్లలో మానవ నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించిన 30కి పైగా చిరుతలు మరణించాయి. ఆందోళనకరంగా, గత సంవత్సరంలోనే 16 మరణాలు నమోదయ్యాయి.

చిరుతపులులు మేకలు, గొర్రెలు, దూడలు, ఆవులు వంటి జంతువులను...