Hyderabad, అక్టోబర్ 4 -- ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అనునిత్యం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంపదలకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే కోజాగరి లక్ష్మీ పూజ చేయడం మంచిది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రాత్రి ఈ పూజ చేయాలి.

దీనిని శరత్ పౌర్ణిమ అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా రాష్ట్రాలలో దీనిని ఘనంగా జరుపుతారు. ఆ రోజు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం. కోజాగరి లక్ష్మీ పూజ ఈసారి ఎప్పుడు వస్తుంది? తేదీ, పూజ సమయంతో పాటు పూజ విధానం గురించి కూడా తెలుసుకుందాం.

కోజాగరి లక్ష్మీ పూజను శరత్ పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ పౌర్ణిమ తిథి సోమవారం, అక్టోబర్ 6న మధ్యాహ్నం 1:23కి ప్రారంభమవుతుంది. మంగళవారం, అక్టోబర్ 7 ఉదయం 9:16తో ముగుస్తుంది. అమ్మవారిని రాత్రి 11:45 నుంచి 12:34 మధ...