భారతదేశం, ఏప్రిల్ 14 -- ఏప్రిల్ 14 - ఈ తేదీకి భారత్‌లో ప్రత్యేక స్థానముంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ 135వ జయంతి ఈరోజు. 1891లో మధ్యప్రదేశ్‌లోని మౌలో జన్మించి, కులవివక్షను జయించి, కోట్లాది మంది జీవితాలను మార్చిన బాబాసాహెబ్ మాటలు నేటికీ సభల్లో మారుమోగుతున్నాయి, గోడలపై రాసే నినాదాలవుతున్నాయి.

అంబేడ్కర్ ఇచ్చిన ఈ ముప్పయి అక్షరాల నినాదం లక్షల మంది జీవితాలను తిరిగి రాసింది. చదువు ద్వారా చైతన్యం, చైతన్యం ద్వారా ఐక్యత, ఐక్యత ద్వారా మార్పు.. ఈ మూడు మెట్లనూ ఒక్క వాక్యంలో బాబాసాహెబ్ నిర్వచించారు. అంబేడ్కర్ స్వయంగా 64 విషయాల్లో డిగ్రీలు, డిప్లొమాలు పొందారు. జ్ఞానమే ఆయుధంగా వ్యవస్థతో పోరాడారు.

"ఒక సమాజం ఎంత ముందుకు వెళ్లిందో తెలుసుకోవాలంటే.. ఆ సమాజంలోని మహిళలు ఎక్కడ ఉన్నారో చూడండి" - ఈ మాటలు దశాబ్దాల ముందే మహిళా సాధికారతను సమా...