భారతదేశం, ఫిబ్రవరి 13 -- Sp Charan: బాలీవుడ్ మూవీ యానిమ‌ల్‌లో తండ్రీ కొడుకుల‌ అనుబంధాన్ని కొత్త కోణంలో ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా. డిసెంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ తొమ్మిది వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తాజాగా తండ్రీ కొడుకుల ఎమోష‌న‌ల్‌తో తెలుగులోనూ ఓ మూవీ రాబోతోంది. ఎల్ వై ఎఫ్ అనే అనే టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ల‌వ్ యువ‌ర్ ఫాద‌ర్ అన్న‌ది ఈ మూవీ క్యాప్ష‌న్‌. ఈ సినిమాలో దివంగ‌త దిగ్గ‌జ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం త‌న‌యుడు ఎస్‌.పి. చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ టాలీవుడ్ మూవీతో ప‌వ‌న్ కేత‌రాజు డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.

ఎల్ వై ఎఫ్ మూవీని మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ క‌లిసి నిర్మిస్...