భారతదేశం, మే 6 -- Rythu Bharosa Funds : తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. దీంతో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ అవుతున్నాయి. ఐదు ఎకరాల పైబడిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. రైతు భరోసా కింద రూ.2 వేల కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులను వ్యవసాయశాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు రైతులకు నిధులు జమ చేయంగా, సోమవారం నుంచి ఐదు ఎకరాలు పైబడిన రైతులకు నిధులు ఖాతాల్లో జమ చేస్తున్నారు. రైతు భరోసా కోసం ప్రభుత్వం దాదాపు రూ.2 వేల కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ రైతు భరోసా నిధుల విడుదల కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలకంగా మారింది.

రైతు భరోసా నిధులపై కాంగ్రె...