భారతదేశం, మే 7 -- Parthu Telugu OTT: ఈ వారం ఓటీటీ ద్వారా సైకో థ్రిల్ల‌ర్ మూవీ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. పార్థు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ ఓటీటీ అనౌన్స్‌చేసింది. మే 9 నుంచి ఈటీవీ విన్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. పార్థు మూవీలో మైఖేల్ తంగ‌దురై, స‌న‌మ్‌శెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించారు. కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు మిస్కిన్ అసిస్టెంట్ అర్జున్ ఎక‌ల‌వ్య‌న్ పార్థు మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

త‌మిళ మూవీ ఓమై సెన్నై మూవీకి తెలుగు డ‌బ్ వెర్ష‌న్‌గా పార్ధు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఓమై సెన్నై మూవీ 2021లో థియేట‌ర్ల‌లో రిలీజైంది. సైకో కిల్ల‌ర్ మూవీలో మైఖేల్ తంగ‌దురై, స‌న‌మ్ శెట్టి యాక్టింగ్‌, డైరెక్ట‌ర్ టేకింగ్‌పై ప్ర‌శంస‌లొచ్చాయి త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

పార్తిబ‌...