భారతదేశం, మే 8 -- Medchal Building Tragedy: భారీ వర్షాలకు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఉన్న గోడ కూలి కార్మికులు ఉంటున్న రేకులషెడ్డుపై పడటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ కూలిపోవడంతో దాని పక్కనే షెడ్డులో ఉంటున్న ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు గోడ నాని కార్మికులు ఉంటున్నన షెడ్డుపై పడింది.

సెంట్రింగ్‌ పనుల కోసం వచ్చిన కార్మికులు కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లోనే రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నారు. వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరితో పాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు చెం...