భారతదేశం, ఏప్రిల్ 27 -- Manjummel Boys OTT: మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మంజుమ్మ‌ల్ బాయ్స్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ శ‌నివారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. మే 5 నుంచి ఈ మూవీ ఓ టీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో మంజుమ్మ‌ల్ బాయ్స్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ప్ర‌క‌టించింది.

మంజుమ్మ‌ల్ బాయ్స్ మూవీ మే 3న ఓటీటీలో రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే మే 3న కాకుండా రెండు రోజులు ఆల‌స్యంగా మే 5న ఈ స‌ర్వైవ‌ల్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.

మ‌ల‌యాళంలో స్టార్లు ఎవ‌రూ లేకుండా కేవ‌లం 20 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన మంజుమ్మ‌ల్ బాయ్స్ మూవీ 230 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది. క‌ల...