భారతదేశం, మార్చి 12 -- Mahalakshmi Mahila Sakthi : కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Govt) కూలగొట్టాలని అంటున్నారని, నేనంత పాపం ఏం చేశా? మీ అవినీతి సొమ్ములో వాటా అడిగానా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భావోద్వేగంగా మాట్లాడారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో 'మహాలక్ష్మి స్వశక్తి మహిళ' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వడ్డీ లేకుండా రుణాలను(Interest Free Loan) మహిళలకు అందిస్తున్నామన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేసీఆర్‌ 7 లక్షల కోట్ల అప్పు చేసి నా నెత్తిన పెట్టి పోయిండన్నారు. ఈ సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఒక్...