తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 27 -- IRCTC Shirdi Nashik Tour Package 2024: సాయిబాబా భక్తుల కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. ఇప్పటికే అనేక ప్యాకేజీలను ప్రకటించగా.. తాజాగా SAI SHIVAM పేరుతో మరో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. 4 రోజుల పాటు ఈ ప్యాకేజీ ఉంటుంది. ఒక్క షిర్డీనే కాకుండా. నాసిక్ లోని పలు ప్రముఖ ఆలయాలను చూడొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మే 03, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ పూర్తి అయితే. మరో తేదీని కూడా ప్రకటిస్తారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....