భారతదేశం, మే 4 -- Chardham Yatra 2024: హిమాలయ పర్వత సానువుల్లో కొలువైన నాలుగు పవిత్ర దేవాలయాల సందర్శనకు ఉద్దేశించిన చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం మే 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రకు మే 8వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. 2024 మే 8 నుండి హరిద్వార్, రిషికేష్లలో ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు హరిద్వార్ లోని రాహి మోటెల్, రిషికేశ్ లోని యాత్ర రిజిస్ట్రేషన్ కార్యాలయం అండ్ ట్రాన్సిట్ క్యాంప్ లో జరుగుతాయి.

ప్రతి ధామ్ కు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ కు రోజువారీ గరిష్ట పరిమితిని రిషికేశ్ లో 1000, హరిద్వార్ లో 500 గా నిర్ణయించారు. అక్షయ తృతియ సందర్భంగా మే 10 నుంచి చార్ ధామ్ యాత్ర 2024 (Chardham Yatra 2024) ప్రారంభం కానుంది. చార్ ధామ్ యాత్ర నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా ప్రప...