భారతదేశం, ఏప్రిల్ 30 -- Bank Holiday-Dormant Accounts: ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమ పథకాల్లో Welfare Schemes భాగంగా ప్రభుత్వం నుంచి వివిధ రకాల పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారులకు ఈ నెల కూడా ఇబ్బందులు తప్పేట్టు లేవు. EC ఈసీ ఆదేశాలతో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో Bank Accounts ప్రభుత్వ పెన్షన్ల Pension సొమ్ము జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త సందేహాలు తలెత్తతున్నాయి. కనీస నిల్వ లేని ఖాతాలు Minimum Balance, నిద్రాణమై ఉన్న ఖాతాల సంగతేమిటనే విషయంలో స్పష్టత లేదు. పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్‌ఎల్‌బిసికి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు జీరో బ్యాలెన్స్‌ ఖాతాలను గత కొన్నేళ్లుగా వదిలించుకుంటున్నారు. 60ఏళ్లకు పైబడిన వారి బ్యాంకు ఖాతాలను కస్టమర్ కోరితే మాత్రమే వాటిని జీరో బ్యాలెన్స్ అకౌంట్ల...